పనుల్లేక తాపీమేస్త్రి ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-05-25T08:23:48+05:30
లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తాపీమేస్ర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన చిట్టి అప్పారావు(50) ఏడాది కాలంగా ఇసుక కొరత, తర్వాత లాక్డౌన్తో పనుల్లేక
తాడేపల్లిగూడెం రూరల్, మే 24: లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తాపీమేస్ర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన చిట్టి అప్పారావు(50) ఏడాది కాలంగా ఇసుక కొరత, తర్వాత లాక్డౌన్తో పనుల్లేక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆదాయం లేకపోవడం తో అద్దె చెల్లించడం కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నాడు. హఠాత్తుగా శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో కు టుంబ సభ్యులు వెతికారు. తాడేపల్లిగూడెం శివారు ముత్యాలంబపురం వద్ద ఉన్న చెరువులో ఆదివారం కనిపించిన మృతదేహం అప్పారావుదిగా గుర్తించారు.
Updated Date - 2020-05-25T08:23:48+05:30 IST