కర్నూలు జిల్లా: రోడ్డుపై గర్భిణీ ప్రసవం
ABN, First Publish Date - 2020-12-15T20:06:31+05:30
పురిటి నొప్పులు భరించలేక ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది.
కర్నూలు జిల్లా: పురిటి నొప్పులు భరించలేక ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా డోన్లో జరిగింది. కొత్తపేటకు చెందిన గర్భిణి ఓబులేశమ్మకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు డోన్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఆమె ప్రసవ నొప్పులు తాళలేక రోడ్డుపైకి పరుగులు తీసింది. అయితే రోడ్డుపై కాన్పు అవుతుందని గుర్తించి.. ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో వైద్యులు రోడ్డుపైనే ఆమెకు చికిత్స అందించారు. ఓబులేశమ్మ రోడ్డుపై బిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Updated Date - 2020-12-15T20:06:31+05:30 IST