ప్రతి మండలానికి శీతల గిడ్డంగులు: జగన్
ABN, First Publish Date - 2020-08-15T08:41:28+05:30
రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తగినంత నిల్వ సామర్థ్యంతో గిడ్డంగులను నిర్మించాలని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు...
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకుని తగినంత నిల్వ సామర్థ్యంతో గిడ్డంగులను నిర్మించాలని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గిడ్డంగులు, కోల్డ్స్టోరేజీల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ...అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల మార్కెటింగ్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్పైనా దృష్టి పెట్టాలన్నారు. గిరిజన ప్రాంతాలతో సహా... ప్రతి మండలానికీ శీతల గిడ్డంగి సదుపాయం కల్పించాలన్నారు. ఆక్వాకు సంబంధించి ఐక్యూఎ్ఫలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
Updated Date - 2020-08-15T08:41:28+05:30 IST