గెలుపోటమలు సర్వ సాధారణం: గద్దె రామ్మోహన్
ABN, First Publish Date - 2020-05-28T01:05:19+05:30
గెలుపోటమలు సర్వ సాధారణమని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. అధైర్యపడకుండా కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు.
అమరావతి: గెలుపోటమలు సర్వ సాధారణమని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. అధైర్యపడకుండా కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఇవాళ భిన్నమైన మహానాడును చూస్తున్నామని, కరోనా కారణంగా జూమ్ యాప్ ద్వారా మహానాడు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. టెక్నాలజీని వాడడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారన్నారు. అన్ని అవకాశాలు ఉన్నా సీఎం జగన్ గదిలోంచి బయటికి రావట్లేదని, చివరికి ప్రెస్ మీట్లకు కూడా జగన్ రావడం లేదని గద్దె రామ్మోహన్ ఎద్దేవాచేశారు.
Updated Date - 2020-05-28T01:05:19+05:30 IST