ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎందుకిస్తారో.. ఎందుకు తీస్తారో..!

ABN, First Publish Date - 2020-12-19T08:06:52+05:30

ఐఏఎ్‌సల బదిలీలు, అప్పగిస్తున్న శాఖల్లో ప్రభుత్వం పూటకో మార్పు చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేఎస్‌ జవహర్‌రెడ్డిని 2 నెలల కింద తిరుమల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఏఎ్‌సల బదిలీలపై రోజుకో జీవో


అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఐఏఎ్‌సల బదిలీలు, అప్పగిస్తున్న శాఖల్లో ప్రభుత్వం పూటకో మార్పు చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేఎస్‌ జవహర్‌రెడ్డిని 2 నెలల కింద తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవోగా బదిలీ చేసింది. టీటీడీ ఈవోగా ఉన్న ఏకే సింఘాల్‌ను ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన ఏపీఎంఎ్‌సఐడీసీ విభాగానికి మాత్రం జవహర్‌రెడ్డినే స్పెషల్‌ సీఎ్‌సగా నియమించింది. టీటీడీ ఈవో అంటే పూర్తిగా తిరుమల, తిరుపతిలోనే ఉండాల్సి ఉంటుంది. ఏపీఎంఎ్‌సఐడీసీ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంది. ఆయన తిరుపతి నుంచి విజయవాడ రావాలంటే కుదిరే పని కాదు. అధికారులు కూడా ఫైళ్లు తీసుకుని తిరుపతికి వెళ్లే పరిస్థితి లేదు. అయినా ప్రభుత్వం ఆయనకు జోడు పదవులు కట్టబెట్టింది. ఇప్పుడు అకస్మాత్తుగా సదరు కార్పొరేషన్‌నూ సింఘాల్‌కు అప్పగిస్తూ సీఎస్‌ ఉత్తర్వులిచ్చారు.

Updated Date - 2020-12-19T08:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising