ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోటార్‌ సైకిల్‌ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-03-13T11:28:49+05:30

మోటార్‌ సైకిల్‌ కొనలేదని పురుగుల మందు తాగిన యువకుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరవలి/ఏలూరు క్రైం, మార్చి 12: మోటార్‌ సైకిల్‌ కొనలేదని పురుగుల మందు తాగిన యువకుడు మృతి చెందాడు. పెరవలి గ్రామానికి చెందిన చదలవాడ వీరకుమార్‌ (19) తండ్రి ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లాడు. తల్లి సోదరుడు, సోదరితో మేనమామ ఇంటి వద్ద ఉంటున్నారు. వీరకుమార్‌ ద్విచక్ర వాహనం కావా లని తల్లిని అడగ్గా అక్కకు వివాహం జరిగిన తరువాత కొంటానని అనడడంతో మనస్థాపంతో ఈ నెల 11న పురుగుల మందు తాగాడు.


వెంటనే అతడిని ఒక ప్రైవేటు ఆసుపత్రికి, తరువాత ఏలూరు ఆశ్రం సుపత్రికి తరలించారు. వీరకుమార్‌ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అతడి మేనమామ యార్లగడ్డ ప్రభాకరరావు ఫిర్యాదు మేరకు పెరవలి ఏఎస్‌ఐ తాతారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికందివచ్చిన కుమారుడి మృతితో తల్లి రోదన స్థానికులను సైతం కంట తడి పెట్టించింది. యువకుడు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కుటుంబానికి ఎంతో తీరని వేదన మిగిల్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-03-13T11:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising