‘వైసీపీ నాయకుడు వేధిస్తున్నాడు’
ABN, First Publish Date - 2020-09-27T07:36:49+05:30
భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఒక వైసీపీ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది...
ఏలూరు టూటౌన్, సెప్టెంబరు: భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఒక వైసీపీ నాయకుడు తనను లైంగికంగా వేధిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా టీడీపీ కార్యాల యంలో శనివారం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి ఆంజనేయులు ఆధ్వ ర్యంలో విలేకరుల సమావేశంలో ఆమె తన గోడును విన్పించింది. అతనిపై టి.నర్సాపురం పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైనా ఇంతవరకూ అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. పొలంలో కరెంట్ మీటరు రాకుం డా అడ్డుకుంటున్నాడని వాపోయింది. ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో దళితులపై రోజురోజుకూ దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి.వెంకటేశ్వర రావు, భీమరాజు, విఠల్, బుజ్జిబాబు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-27T07:36:49+05:30 IST