ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ జెండా రంగులు తొలగించాలి

ABN, First Publish Date - 2020-12-20T04:53:26+05:30

ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా మార్చకపోవడం విచారకరమని జనసేన నాయకులు పేర్కొన్నారు.

వినతిపత్రం ఇస్తున్న జనసేన నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, డిసెంబరు 19: ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ జెండా రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా మార్చకపోవడం విచారకరమని జనసేన నాయకులు పేర్కొన్నారు. వారం రోజుల్లోగా రంగులు మార్చని పక్షంలో హైకోర్టులో కోర్టు దిక్కరణ పిటీషన్‌ ధాఖలు చేస్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు. తహసీల్దార్‌ సుందరరాజుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. ప్రజాధనంతో నిర్మితమైన ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చకపోవడం కోర్టు ధిక్కారమేనని జనసేన నాయకులు అన్నారు. వారం రోజులలోగా కార్యాలయాలకు రంగులను మార్చాలని డిమాండ్‌ చేశారు. మండల జనసేన అధ్యక్షుడు గుండా రామకృష్ణ, గుండా శ్రీనివాసబాబు, కెశ్రీనివాస్‌, బి మణికంఠ, కొల్లా వెంకట్‌, వడ్డే రక్షణకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T04:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising