ప్రతీ ఇంటికీ నిత్యావసరాలు అందిస్తాం : మంత్రి
ABN, First Publish Date - 2020-03-29T10:53:19+05:30
నిత్యావసర వస్తువులు ప్రతిఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకు వాడ శ్రీరంగనాథరాజు
ఆచంట మార్చి 28 : నిత్యావసర వస్తువులు ప్రతిఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకు వాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఆచంటలోని సంతమార్కెట్, హోల్సేల్ రిటైల్ కూరగాయల దుకాణాలను, నిత్యావసర వస్తువుల దుకాణాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఎవరైనా నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఫించన్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి 8 గంటల్లోపు బయోమెట్రిక్ లేకు ండా అందించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి ఎల్బీవీ సత్యనారాయణ,తహసీల్దారు ఆర్వీ కృష్ణారావు, ఎంపీడీవో ఎన్.శ్రీనివాసరావు ఉన్నారు.
Updated Date - 2020-03-29T10:53:19+05:30 IST