వేగంగా ఇసుక అందిస్తాం : ఆర్డీవో
ABN, First Publish Date - 2020-06-05T11:26:57+05:30
ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు త్వరితగతిన ఇసుక చేరే విధంగా అధికారులను ఆదేశించినట్టు ఆర్డీవో లక్ష్మారెడ్డి ..
కొవ్వూరు, జూన్4 : ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు త్వరితగతిన ఇసుక చేరే విధంగా అధికారులను ఆదేశించినట్టు ఆర్డీవో లక్ష్మారెడ్డి తెలిపారు. ఏపీఎండీసీ అధికారులతో గురువారం ఆర్డీవో సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక ర్యాంప్లు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి సాయంత్రం ఆరు గంటలకు మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ర్యాంప్లలో తవ్వకాలకు లక్ష్యాలను నిర్ధేశించామని తెలిపారు. ప్రతీ శనివారం బోటు యజమానుల బిల్లులు తయారు చేసి సోమవారం ఏపీఎండీసీ జిల్లా కార్యాలయానికి పంపించి ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక ర్యాంపులలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్లైన్లో చెల్లించే సొమ్ముకంటే లారీ డ్రైవర్లు, దళారులకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించనవసరం లేదన్నారు.
Updated Date - 2020-06-05T11:26:57+05:30 IST