నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం
ABN, First Publish Date - 2020-03-24T11:28:38+05:30
క్షయవ్యాధి పట్ల జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నయం చేయవచ్చని పాలకోడేరు పీహెచ్సీ వైద్యాధికారి, సీహెచ్వీ రంగంనాయుడు
పాలకోడేరు, మార్చి 23 : క్షయవ్యాధి పట్ల జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా నయం చేయవచ్చని పాలకోడేరు పీహెచ్సీ వైద్యాధికారి, సీహెచ్వీ రంగంనాయుడు తెలిపారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. క్షయవ్యాధి పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆకివీడు క్లస్టర్ ఏరియాలో ఆకివీడు, ఉండి, పెదకాపవరం, పాలకోడేరు, యండగండి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో 153 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు.
Updated Date - 2020-03-24T11:28:38+05:30 IST