ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతులకు అండగా ఉద్యమిస్తాం

ABN, First Publish Date - 2020-10-30T12:03:03+05:30

రాజధాని రైతులకు అండగా ఉద్యమాలు చేస్తామని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షుడు గన్ని


భీమడోలు/అత్తిలి,అక్టోబరు 29 :రాజధాని రైతులకు అండగా ఉద్యమాలు  చేస్తామని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు,మాజీ  ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హెచ్చరించారు. భీమడోలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేసి అధికారులకు విన తిపత్రాన్ని అందజేశారు.రాజధాని రైతులకు బేడీలు వేసి తరలించడం అత్య ంత దుర్మార్గమని అన్నారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అత్యంత తీవ్రమైన కేసుల్లో తప్ప నిందితులకు బేడీలు వేయకూడదనే నిబంధనను పోలీసులు కాలరాశారన్నారు.ఉద్యమాన్ని రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న దాష్టీకాలకు పోలీసులు వంతపాడడం హేయ నీయ చర్య అన్నారు. దళిత రైతులపై దళిత వ్యతిరేక చట్టాలతో కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు.రాజధాని పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అత్తిలిలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేశారు.

Updated Date - 2020-10-30T12:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising