ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికుల ఎన్నికల హామీలు నెరవేర్చాలి

ABN, First Publish Date - 2020-10-28T08:17:56+05:30

ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని సీఐటీయూ నాయకులు బి. సోమయ్య, బి.జగన్నాథరావులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 27: ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని సీఐటీయూ నాయకులు బి. సోమయ్య, బి.జగన్నాథరావులు డిమాండ్‌ చేశారు. మునిసిపల్‌ కార్మికులు మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలలుగా బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. 11వ పీఆర్‌సీకి అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు. స్కూల్‌ స్వీపర్లకు ఫుల్‌టైమ్‌ వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె, యూనిఫాంలు, ఇతర పనిముట్లు అందజేయాలన్నారు. వెంటనే మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపడాతమని హెచ్చరించారు. కార్యక్రమంలో కెవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కె. రవీంద్ర, ఎ.జాన్‌బాబు, ఎల్‌.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T08:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising