‘కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయం’
ABN, First Publish Date - 2020-10-27T09:28:09+05:30
కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అన్నారు.
టి.నరసాపురం, అక్టోబరు 26 : కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అన్నారు. మక్కినవారిగూడెంలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న గెడా సూర్యప్రకా శ్రావును, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మక్కినవారిగూడెంకు చెందిన కొటారి సత్యహర్షలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్య కర్తలకు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు మండల అధ్య క్షుడు ఘంటా సతీశ్, ఆచంట సత్యనారాయణ, గెడా శ్రీధర్, వీరేశలింగం, గోపాలరావు, ఆచంట బాబి, పిడతా పెంటయ్య పాల్గొన్నారు
Updated Date - 2020-10-27T09:28:09+05:30 IST