ఈ కర్షక్లో నమోదు చేయకపోతే చర్యలు
ABN, First Publish Date - 2020-10-04T07:34:11+05:30
రైతుల సంక్షేమానికి దోహ దపడే ఈ-కర్షక్లో నమోదుకు ఈనెల 5వతేదీ లోపు గడువు ఉందని తాడేపల్లి గూడెం ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు.
గణపవరం, అక్టోబరు 3: రైతుల సంక్షేమానికి దోహ దపడే ఈ-కర్షక్లో నమోదుకు ఈనెల 5వతేదీ లోపు గడువు ఉందని తాడేపల్లి గూడెం ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. గణపవరం, నిడమర్రు మండ లాల విలేజ్ అగ్రికల్చరల్ అసి స్టెంట్లకు శనివారం సరిప ల్లెలో రైతు భరోసా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లు అందరూ రైతులకు ఈ కర్షక్లో నమోదు, చేర్పులు, మార్పులకు ఈ నెల 5వ తేదీ లోపు సరుచు కునేలా కృషి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతు ఇబ్బంది పడితే ఆ సంబంధిత వీఆర్వో, వీఏఏల మీద జాయింట్ కలెక్టర్ చర్యలు తీసు కుంటారని మురళీకృష్ణ హెచ్చరించారు. గణపవరం, నిడమర్రు ఏవోలు ఎర్రం శెట్టి ప్రసాద్, బెన్సీబాబు, ఏఈవోలు, వీఏఏలు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-04T07:34:11+05:30 IST