రేపటి నుంచి గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు
ABN, First Publish Date - 2020-10-04T07:33:16+05:30
పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వ తేదీ వరుకు గొర్రెలు, మేకలకు పీపీఆర్ (పారుడువ్యాధి) వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు పెంటపాడు డివిజన్ పశు సంవర్థకశాఖ డీడీ అడబాల విశ్వేశ్వరరావు అన్నారు.
పశుసంవర్థక శాఖ డీడీ విశ్వేశ్వరరావు
పెంటపాడు, అక్టోబరు, 3 : పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వ తేదీ వరుకు గొర్రెలు, మేకలకు పీపీఆర్ (పారుడువ్యాధి) వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేయనున్నట్లు పెంటపాడు డివిజన్ పశు సంవర్థకశాఖ డీడీ అడబాల విశ్వేశ్వరరావు అన్నారు. డివిజన్ పరిధిలో 2,01,000 గొర్రెలు, 12,000 మేకలకు ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా వర్షాకాలంలో గొర్రెలు, మేకలకు పీపీఆర్ వ్యాధి సోకే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్ వేయనున్నామన్నారు.గొర్రెలు, మేకల మందల వద్దకు పశుసంవర్థక శాఖ సిబ్బంది స్వయంగా వెళ్లి పీపీఆర్ వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వేస్తారన్నారు.
Updated Date - 2020-10-04T07:33:16+05:30 IST