ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేయూతకు నేటితో ముగియనున్న గడువు

ABN, First Publish Date - 2020-07-05T11:40:08+05:30

మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం శక్తి సంఘాల మహిళలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇప్పటికీ 50 శాతమే నమోదు..

గడువు పెంచాలంటూ విజ్ఞప్తి 


ఏలూరు రూరల్‌, జూలై 4 : మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం  వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. స్వయం శక్తి సంఘాల మహిళలతో పాటు ఇతర మహిళలకు నాలుగేళ్లల్లో ఒకొ క్కరికి రూ.75 వేలు చొప్పున ఈపథకం కింద అందించా లని నిర్ణయిం చింది. ఈనెల ఐదులోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది.  ఇప్పటి వరకూ జిల్లాలో 50 శాతం దరఖాస్తులు కూడా నమోదు కాలేదు. నేటితో గడువు ముగియనుండడంతో దరఖాస్తు దారుల్లో ఆందోళన నెల కొంది. ఈ పథకం పొందాలంటే కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.


వీటి కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ అత్యధికు లు ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా మంది దరఖాస్తుదారుల ఫోన్‌ నెంబ ర్లు ఆధార్‌ నెంబర్‌కు లింకు కాలేదు. దీంతో దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. మరో పక్క సర్వర్‌  మొరాయింపు ఇబ్బందిగా మారింది. అలాగే వార్షిక ఆదాయంపై స్పష్టత లేకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకునేవారు సతమతమవుతున్నారు.  ప్రభుత్వం అర్హతలకు సంబంధించి పూర్తి నిబంధనలు తెలపడంతో పాటు గడువు పొడిగించా లని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-07-05T11:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising