ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగిన రిజిస్ర్టేషన్లు

ABN, First Publish Date - 2020-03-25T10:46:03+05:30

కరోనా దెబ్బకు జిల్లాలో రిజిస్ర్టేషన్లు దారుణంగా పడిపోయాయి. రోజూ వందల సంఖ్యలో జరిగే రిజిస్ర్టేషన్లు పదుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లావాదేవీలను కాటేసిన కరోనా 

ప్రభుత్వాదాయానికి భారీగా గండి


ఏలూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు జిల్లాలో రిజిస్ర్టేషన్లు దారుణంగా పడిపోయాయి. రోజూ వందల సంఖ్యలో జరిగే రిజిస్ర్టేషన్లు పదుల సంఖ్యను కూడా చేరడం లేదు. ఏలూరు, భీమవరర  రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల పరిధిలోని 27 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతీ నెలా 15 వేలకు పైగా రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయి. పదిహేను రోజులుగా కరోనా దెబ్బకు రిజిస్ర్టేషన్లు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో జనతా కర్ఫ్యూ మొదలైన నాటి నుంచి రిజిస్ర్టేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. కక్షిదారులందరూ లావాదేవీలను వాయిదా వేసుకున్నారు.


దస్తావేజు లేఖరులు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే కార్యాలయాలు కక్షిదారులు లేక వెలవెలబోతున్నాయి. జనతా కర్ఫ్యూ మొదల య్యాక రిజిస్ర్టేషన్లు పూర్తిగా ఆగిపోయాయని రిజిస్ట్రార్‌ ఎల్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. సగటున ఒకటి, రెండు అవ్వడమే కష్టంగా ఉందన్నారు. 

Updated Date - 2020-03-25T10:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising