ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షిర్డీ ప్రయాణికులకు శుభవార్త

ABN, First Publish Date - 2020-11-28T05:32:51+05:30

షిర్డీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త. డిసెంబరు ఒకటో తేదీ నుంచి నరసాపురం – నాగర్‌సోల్‌ మధ్య ప్రత్యేక రైలుగా పట్టాలెక్కనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1న పట్టాలెక్కనున్న నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

నరసాపురం, నవంబరు 27 : షిర్డీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త. డిసెంబరు ఒకటో తేదీ నుంచి నరసాపురం – నాగర్‌సోల్‌ మధ్య ప్రత్యేక రైలుగా పట్టాలెక్కనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 23 నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల తరువాత మళ్లీ ఈ రైలుకు పచ్చజెండా ఊపుతూ దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ రైలు వారంలో ఐదు రోజులు వరంగల్‌ మీదుగా, శుక్ర, ఆదివారాలు గుంటూరు మీదుగా నాగర్‌సోల్‌ వెళుతుంది. నరసాపురంలో ఉదయం 11.05 గంటలకు ఈ రైలు బయలుదేరి వరంగల్‌ మీదుగా వెళ్లే రోజుల్లో నాగర్‌సోల్‌కు ఉదయం 6.30 గంటలకు చేరుతుంది. గుంటూరు మీదుగా వెళ్లే రోజుల్లో ఉదయం 9.30 గంటలకు వెళుతుంది. తిరిగి అక్కడ మఽధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం వస్తుంది. 

Updated Date - 2020-11-28T05:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising