రైతు బజార్లు సమయానికి తెరవడం లేదు
ABN, First Publish Date - 2020-03-28T10:37:19+05:30
అధికారులే కరోనా వైరస్ వ్యాప్తి చెందేవిధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు కూడా వ్యవసాయ...
ఆకివీడు, మార్చి 27: అధికారులే కరోనా వైరస్ వ్యాప్తి చెందేవిధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు కూడా వ్యవసాయ మార్కెట్ గేటు తీయకపోవడంతో విని యోగ దారులు గుమికూడారు. గేటు తెరిచిన తరువాత క్యూలో నిలబడ్డారు. రైతు బజార్లు సమయానికి తెరవాలని, ఇరవై వార్డులకు రెండు చోట్లే కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, నాలుగు వార్డులకు ఒక్కొక్క రైతు బజారు ఏర్పాటు చేయాలని కోరారు.
Updated Date - 2020-03-28T10:37:19+05:30 IST