అకౌంట్ నుంచి రూ.11 లక్షల అపహరణ
ABN, First Publish Date - 2020-08-09T11:34:51+05:30
ఒక మహిళకు చెందిన అకౌంట్ నుంచి నగదు డ్రా చేసిన ఘటనపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఏలూరు క్రైం, ఆగస్టు 8 : ఒక మహిళకు చెందిన అకౌంట్ నుంచి నగదు డ్రా చేసిన ఘటనపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దఫదఫా లుగా రూ.11.91 లక్షల నగదును ఏటీఎం ద్వారా డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఏలూరు విద్యానగర్కు చెందిన గుమ్మళ్ళ రాజేశ్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.
తండ్రి మరణించ డంతో డెత్ బెనిఫిట్ సొమ్ము రూ.ఐదు లక్షలు అతని తల్లి అకౌంట్లో జమ అయ్యా యి. ఆమె తల్లికి ఏలూరు శాంతినగర్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఈనెల 7వ తేదీన రాజేశ్ బ్యాంక్కు డబ్బులు డ్రా చేయడానికి వెళ్లాడు. అకౌంట్లో రూ.11,94,694 నగదు ఉండాల్సి ఉండగా కేవలం రూ.3,770 మాత్రమే నగదు ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో స్టేట్మెంట్ పరిశీలించగా ఈ ఏడాది జూన్ 25 నుంచి జూలై 25 వరకు 28 సార్లు ఏటీఎం ద్వారా ఆ సొమ్ములను అపహరించినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో సీఐ మూర్తి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-08-09T11:34:51+05:30 IST