ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకతాయిలపై కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-04-26T11:32:40+05:30

ఆకతాయిలు మోటారు సైకిళ్లపై రోడ్డు పైకి వస్తున్నారని అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు రేంజ్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకతాయిలపై కేసులు నమోదు  


ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 25 : ఆకతాయిలు మోటారు సైకిళ్లపై రోడ్డు పైకి వస్తున్నారని అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు  ఆదేశించారు. ఏలూరు నగరంలోని పలు ప్రాంతాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ప్రాంతాల్లోని పోలీస్‌ పికెట్లను తనిఖీ చేసి పలు సూచనలు ఇచ్చారు. ఈ సంద ర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటలోపు నిత్యావసర సరుకులు, ఇతర పనులను ముగించు కోవాలని సూచించారు. ఆ తర్వాత సరైన కారణం లేకుండా ఎవరైనా బయటికి వస్తే కేసులు నమోదు చేయా లని ఆదేశించారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై 5,734 ఐపీసీ కేసులు నమోదు చేసి 13,372 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 3,181 దుకాణాలపై కేసు లు నమోదు చేసి 1,16,784 వాహనాలపై మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి రూ.6,66,51,517లు అపరాధ రుసుం విధించినట్టు చెప్పారు. 4,445 వాహనాలను సీజ్‌ చేశా మని వెల్లడించారు. అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులను గరికపాడు, చింతలపూడి, జీలుగుమిల్లి వద్ద ఏర్పాటు చేశామని వెల్లడిం చారు. ఏలూరు త్రీటౌన్‌ సీఐ ఎంఆర్‌ఎల్‌ మూర్తిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2020-04-26T11:32:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising