రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఢీకొన్న బైక్
ABN, First Publish Date - 2020-11-03T17:08:39+05:30
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి గట్టుపై భక్తాంజనేయ స్నానఘట్టం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి గట్టుపై భక్తాంజనేయ స్నానఘట్టం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తితో పాటు... బైక్ నడిపిస్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-11-03T17:08:39+05:30 IST