రోడ్ కం రైల్ బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం
ABN, First Publish Date - 2020-08-12T10:57:27+05:30
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు.
కొవ్వూరు, ఆగస్టు 11: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెనపై రాకపోకలు పునరుద్ధరించారు. కరోనా విజృంభన నేపథ్యంలో జూలై 21 నుంచి రోడ్డు కం రైలు బ్రిడ్జిపై రాకపోకలను నిలుపుదల చేశారు.నాలుగవ బ్రిడ్జి గోతులతో నిండి ఉండ డం..పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డుకమ్ రైలు బ్రిడ్జిపై రాకపోకలను ఆంక్షలను సడలిస్తూ ఆదేశాలు జారీ చేశారు.వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అత్య వసరమైతే తప్ప రాకపోకలను కొనసాగించవద్దన్నారు.
Updated Date - 2020-08-12T10:57:27+05:30 IST