నిర్వాసితులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN, First Publish Date - 2020-07-06T11:50:38+05:30
పోలవరం నిర్వాసితు లకు పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేలేరుపాడు ..
వేలేరుపాడు మండల అఖిలపక్షం డిమాండ్
వేలేరుపాడు, జూలై 5: పోలవరం నిర్వాసితు లకు పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేలేరుపాడు మండల అఖిలపక్షం డి మాండ్ చేసింది. ఆదివా రం అన్ని రాజకీయ పక్షాల నాయకులతో నిర్వాసితులతో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖి లపక్ష కమిటీ అధ్యక్షుడు కేశగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2007లో సేకరించిన భూములకు మరో రూ.5 లక్షలు అదనంగా ఇస్తామని, గత ప్రభుత్వం నిర్వాసితులకు ప్రటించిన వ్యక్తిగత పరిహారం రూ.6.36 లక్షలను రూ.10 లక్షలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారని ఈ హామీలను నెరవేర్చి నిర్వాసితులను ఆదు కోవాలని కోరారు.
Updated Date - 2020-07-06T11:50:38+05:30 IST