నిట్ ఉద్యోగినుల ప్రదర్శన
ABN, First Publish Date - 2020-02-20T06:53:29+05:30
ఏపీ నిట్లో మహిళల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని మహిళా ఉద్యోగినులు బుధవారం ప్రదర్శన చేశారు.
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి) : ఏపీ నిట్లో మహిళల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదని మహిళా ఉద్యోగినులు బుధవారం ప్రదర్శన చేశారు. ఎటువంటి లైంగిక వేధింపులు లేవని స్పష్టం చేశారు. నిట్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ, మహిళా గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. కమిటీ ప్రతినిధి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నిట్లో మహిళలకు వేధింపులు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేయ డం మంచి పద్ధతి కాదన్నారు.ఇప్పటికైనా నిరాధార ఆరోపణలకు స్వస్తి పలకాలన్నారు. నిట్ డైరెక్టర్కు మద్దతుగా నిలిచారు.ప్రదర్శనలో కమిటీ సభ్యులు వై.దీపిక, పి.సంధ్యారాణి,కమల తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-02-20T06:53:29+05:30 IST