ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్లు దండుకుంటున్నారు

ABN, First Publish Date - 2020-06-02T09:30:39+05:30

పేదల ఉపాధి హామీ పథకాన్ని వైసీపీ ఉపాధి పథకంగా మార్చుకొని కోట్లు దండుకుంటున్నారని ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు


పాలకొల్లు టౌన్‌, జూన్‌ 1: పేదల ఉపాధి హామీ పథకాన్ని వైసీపీ ఉపాధి పథకంగా మార్చుకొని కోట్లు దండుకుంటున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని అఽధికార పార్టీ ఎంపీ ఒకరు వీడియో రిలీజ్‌ చేయడం అంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీ జరుగుతోందో అర్ధం అవుతుందన్నారు. నెల రోజులుగా పాలకొల్లు నియోజకవర్గంలో భూమి కొనుగోలులో అక్రమాలు, పంపిణీలపై బాధితులు స్వయంగా కలెక్టర్‌, ఎస్పీలకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ చర్య లు లేవని, దీనిని బట్టి చూస్తే ఇది ప్రభుత్వ దోపిడీ అని అర్ధం అవుతుం దన్నారు. ప్రభుత్వ పనుల పేరుతో ఇరిగేషన్‌, డ్రెయిన్స్‌, శ్మశాన వాటికలను వైసీపీ నాయకులు కొల్లగొట్టేస్తున్నప్పటికీ చర్యలు లేవని ఆరోపించారు. పాల కొల్లులో అక్రమంగా వసూలు చేసిన రూ.50 కోట్లను వెనక్కి ఇవ్వాలని ఎమ్మెల్యే నిమ్మల డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-06-02T09:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising