29న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
ABN, First Publish Date - 2020-10-25T11:07:57+05:30
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజ యవాడలో ఈనెల 29న నిర్వ హిస్తున్న..
బుట్టాయగూడెం, అక్టోబరు 24 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజ యవాడలో ఈనెల 29న నిర్వ హిస్తున్న రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ పిలుపు నిచ్చారు. బుట్టాయగూ డెంలో శనివారం సంఘం నా యకుడు మూలెం బ్రహ్మయ్యతో కలిసి సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. కార్మికులను ఆదుకునే చర్యలను ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. కె.బుచ్చిరా జు, డి.మారయ్య పాల్గొన్నారు.
Updated Date - 2020-10-25T11:07:57+05:30 IST