ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించకుంటే ప్రమాదమే : గ్రంధి

ABN, First Publish Date - 2020-03-30T09:21:56+05:30

సామాజిక దూరం పాటించకుండా ఇష్టాను సారం వ్యవహరించడం ప్రమాదకరమని ఎమ్మెల్యే గ్రంధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, మార్చి 29 : సామాజిక దూరం పాటించకుండా ఇష్టాను సారం వ్యవహరించడం ప్రమాదకరమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం పట్టణ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారం రోజులుగా పట్టణ ప్రజలు లాక్‌డౌన్‌కు ఎంతగానో సహకరించారని, ఐతే ఆదివారం నాడు వందలాది మంది రోడ్లపైకి రావటం, సామాజిక దూరం పాటించకపోవటం, కనీసం మాస్కులు కూడా ధరించకుండా బయటకు రావటం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. 


దీని వల్ల జరిగే నష్టం ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని, సమాజాన్ని, కుటంబాలను దృష్టిలో పెట్టుకుని వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి వేడుకొంటున్నానని ఆయన అన్నారు. ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని కోరారు.

Updated Date - 2020-03-30T09:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising