ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ శతాధిక కవి సమ్మేళనం

ABN, First Publish Date - 2020-03-02T11:47:39+05:30

సామాజిక దురాగతాలపై కవులు తమ కలాలను సంధించాలని ప్రముఖ కవి, రచయిత, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులు డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ అన్నారు. ఏలూరులోని ఎన్‌ గ్రాండ్‌ కన్షెక్షన్‌ హాలులో శ్రీశ్రీ కళావేదిక,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దురాగతాలపై కలం సంధించాలి

జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో డాక్టర్‌ కత్తిమండ 

ఏలూరు కల్చరల్‌, మార్చి 1 : సామాజిక దురాగతాలపై కవులు తమ కలాలను సంధించాలని ప్రముఖ కవి, రచయిత, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యులు డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ అన్నారు. ఏలూరులోని ఎన్‌ గ్రాండ్‌ కన్షెక్షన్‌ హాలులో శ్రీశ్రీ కళావేదిక, వేదిక సీసీ టీవీ ఆదరణాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కవిత్వం ఒక సంచలన రాతల సమరం కావాలని కవిత్వంలో యాస, భాషలకన్నా భావానికే ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.


కవులు కవిత్వాన్ని కొత్త కోణంలో రాయాలని, కవిత్వం చిరస్థాయిగా నిలవాలంటే సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకోవాలని కోరారు. వేదిక కన్వీనర్‌ డాక్టర్‌ ఆరవల్లి నరేంద్ర అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళంలో మొత్తం 150 మంది కవులు తమ కవితా గానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులతో కవితా ప్రవాహం సాగింది. బోళ్ల సతీష్‌ రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఆరవల్లి నరేంద్ర, జి.అంజు, కొల్లి రమావతి, రాధాకుసుమ, బీవీవీ సత్యనారాయణ, మట్టా సత్యనారాయణ, డాక్టర్‌ ఐ.సంధ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T11:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising