పాలకొల్లు మండలంలో 2500 ఎకరాల పంట నష్టం
ABN, First Publish Date - 2020-10-30T04:32:41+05:30
వర్షాలతో మండలంలో 2500 ఎకరాల్లో వరికి నష్టం జరిగినట్లు మండల వ్యవసాయాధికారి అబ్దుల్ రహీం గురువారం విలేకర్లకు తెలిపారు.
పాలకొల్లు మండలంలో 2500 ఎకరాల పంట నష్టం
పాలకొల్లు రూరల్: వర్షాలతో మండలంలో 2500 ఎకరాల్లో వరికి నష్టం జరిగినట్లు మండల వ్యవసాయాధికారి అబ్దుల్ రహీం గురువారం విలేకర్లకు తెలిపారు. ఆగస్టులో కురిసిన వర్షాలకు 269 ఎకరాల పంటకు నష్టం వాటి ల్లగా 206 మంది రైతులకు రూ.16.14లక్షలు పంట భీమా మంజూరైంద న్నారు. సెప్టెంబరులో 910ఎకరాల పంట నష్టం వాటిల్లగా 381మంది రైతులకు రూ.54.63 లక్షలు బ్యాంకు ఖాతాలకు జమచేసినట్లు తెలిపారు. అక్టోబరులో వర్షాలకు పంట నష్టంపై సర్వే చేస్తున్నట్లు రహీం తెలిపారు.
Updated Date - 2020-10-30T04:32:41+05:30 IST