ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల నడ్డివిరిచేందుకే ‘మోటార్లకు మీటర్లు’

ABN, First Publish Date - 2020-10-17T11:27:57+05:30

రైతుల నడ్డివిరిచే కార్యక్రమమే మోటా ర్లకు మీటర్లు బిగింపు’ అని తిరుమలంపాలెం రైతులు ఆందోళన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమలంపాలెంలో రైతులు ఆందోళన 


ద్వారకా తిరుమల, అక్టోబరు 16: ‘రైతుల నడ్డివిరిచే కార్యక్రమమే మోటా ర్లకు మీటర్లు బిగింపు’ అని తిరుమలంపాలెం రైతులు ఆందోళన చేశారు. స్థానిక సొసైటీ కార్యాలయం వద్ద మోటార్లకు మీటర్ల బిగింపుపై రైతు లకు అవగాహన సదస్సును ఎం.నాగులపల్లి సెక్షన్‌ విద్యుత్‌ శాఖ ఏఈ జి.శ్రీనివాస్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అయితే రైతులు అవగాహన సదస్సు ను అడ్డుకుని.. రైతులు నష్టపోతారంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరించే ఏ ప్రభుత్వం అధికారంలో నిలబడలేదన్నారు. అనంతరం రాజపాలెంలో జరిగిన గ్రామసభను రైతులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో రైతులు మాసిరెడ్డి గాంధీ, పావులూరి మధుబాబు, పావులూరి నెహ్రూ, పాకలపాటి రామచంద్రరావు, శ్రీనివాసరావు, రాజుపాలెం లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డీవీఎస్‌ చౌదరి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-17T11:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising