ముంచుతున్న మురుగు కాల్వలు
ABN, First Publish Date - 2020-10-30T04:16:24+05:30
చినకాపవరం, అయిశా మురుగు డ్రెయిన్లు రైతులను ముంచేస్తున్నాయి. తూడు, గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవ డంతో పాటు ఆక్రమణకు గురికావడంతో ఇళ్లు, చేలు ముంపు బారిన పడుతున్నాయి.
ఆకివీడు, అక్టోబరు 29: చినకాపవరం, అయిశా మురుగు డ్రెయిన్లు రైతులను ముంచేస్తున్నాయి. తూడు, గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవ డంతో పాటు ఆక్రమణకు గురికావడంతో ఇళ్లు, చేలు ముంపు బారిన పడుతున్నాయి. ముంపు తొలగడానికి కూడా అవకాశం లేక రైతులు నష్టపోతున్నారు. ఈ రెండు మురుగు కాల్వలతో ఆకివీడు సమతానగర్, సుందరయ్యకాలనీ, పుచ్చలదిబ్బ, సిద్ధాపురం వంతెన కింద, ధర్మాపురం అగ్రహారం ప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా ఉప్పుటేరు బ్రిడ్జి దగ్గర పూడికతో ముంపు తొలగడంలేదని పలువురు వాపోతున్నారు.
Updated Date - 2020-10-30T04:16:24+05:30 IST