ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాలు త్వరితగతిన గ్రౌండింగ్‌ కావాలి

ABN, First Publish Date - 2020-12-10T05:51:58+05:30

పేద ప్రజల సంక్షేమ పథకాలు త్వరితగతిన గ్రౌం డింగ్‌ అయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు ఆదేశించారు.

వీసీలో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ముత్యాలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌

ఏలూరు సిటీ, డిసెంబరు 9: పేద ప్రజల సంక్షేమ పథకాలు త్వరితగతిన గ్రౌం డింగ్‌ అయ్యేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ రేవు ముత్యాల రాజు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి బుధవారం కలెక్టర్‌ జిల్లాలోని ఎంపీడీవోలు, ఏపీఎంలతో జగనన్నతోడు, వైఎస్‌ఆర్‌ బీమా, జగనన్న చేయూత పథకాల అమలుపై సమీక్షించారు. జగనన్నతోడు పథకం ప్రారంభించి నెలరోజులు గడచినా ఇంకా గ్రౌండింగ్‌ చాలా తక్కువగా ఉండటంపై అసహనాన్ని వ్యక్తం చేశా రు. 74,471 మంది దరఖాస్తులను ఆమోదించగా గ్రౌండింగ్‌ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఈనెల 14వతేదీ లోపు లక్ష్యాలను అధిగమించకపోతే 15వ తేదీన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.  వైఎస్‌ఆర్‌ బీమా అమలుకు 9,52,518 రైస్‌ కార్డులు కలిగిన కుటుంబాలలో కుటుంబ పోషకులను గుర్తించి నమోదు చేయాల్సి ఉండగా  నమోదు శాతం తక్కువగా ఉందన్నారు. సమావేశంలో జేసీ ఎన్‌.తేజ్‌భరత్‌, డీఆర్‌డీఏ పీడీ జె.ఉదయ భాస్కర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-10T05:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising