యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తవ్వాలి
ABN, First Publish Date - 2020-12-05T05:12:06+05:30
ప్రభుత్వ భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన మార్చి మొదటి వా రానికి పూర్తవ్వాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు.
ఏలూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన మార్చి మొదటి వా రానికి పూర్తవ్వాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సచివాలయం, ఆర్ బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలపై పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్త్ లెవెల్, బేస్మెంట్ స్థాయిలో ఉన్నవాటిపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. కొన్ని మండలాల్లో పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో జేసీ నంబూరి తేజ్భరత్, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జేవీ రాఘవులు, డ్వామా పీడీ రాంబాబు, అన్ని శాఖల ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-05T05:12:06+05:30 IST