శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు : సీఐ
ABN, First Publish Date - 2020-08-05T11:43:42+05:30
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పలువురు రాజకీయ నాయకులకు సీఐ నాయక్ హితవు పలికారు.
జంగారెడ్డిగూడెం టౌన్, ఆగస్టు 4 : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పలువురు రాజకీయ నాయకులకు సీఐ నాయక్ హితవు పలికారు. మంగళవారం జంగారెడ్డిగూడెంలోని సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు సమస్య తలెత్తేలా ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేయకూడదని సూచించారు. కొంతమంది శానిటైజర్లు సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ సెంటర్లకు పంపుతామని నాయక్ తెలిపారు. 22న వినాయక చవితిని ప్రజలు ఇళ్ళల్లోనే జరుపుకోవాలని నాయక్ తెలిపారు. నిమజ్జనానికి కూడా వెళ్ళడానికి వీలులేదని తెలిపారు. కరోనా నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Updated Date - 2020-08-05T11:43:42+05:30 IST