రైతు భరోసా కేంద్రాల్లో పనిముట్లు అద్దెకు ఇవ్వవచ్చు
ABN, First Publish Date - 2020-08-11T10:49:09+05:30
రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ గ్రూప్స్ ద్వారా వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను రైతులకు అద్దెకు ఇవ్వవచ్చునని మార్టేరు..
అత్తిలి, ఆగస్టు 10 : రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ గ్రూప్స్ ద్వారా వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను రైతులకు అద్దెకు ఇవ్వవచ్చునని మార్టేరు ఏడీఏ ఎంవీ రమేష్ అన్నారు. అత్తిలి రైతు భరోసా కేంద్రంలో సోమవారం డీసీసీబీ బ్యాంక్ అధికారులు, సొసైటీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేసే గ్రూపుల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అత్తిలి, పెనుమంట్ర మండల వ్యవసాయాధికారులు అన్నదాత గంగాధర్, కె.రాజేంద్ర ప్రసాద్, సొసైటీ సెక్రటరీలు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-11T10:49:09+05:30 IST