ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డివైడర్‌ దాటి వచ్చిన మృత్యువు

ABN, First Publish Date - 2020-11-27T04:57:49+05:30

జాతీయ రహదారిపై విజ యవాడ నుంచి తాడేపల్లి గూ డెం వైపు వెళుతున్న ఇన్నోవా కారు డివైడర్‌ను దాటి వచ్చి అవతల వైపు వెళుతున్న కారును ఢీకొన్న ఘటనలో ఒక రు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు.

సింగవరం వద్ద రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు

దెందులూరు, నవంబరు 26 : జాతీయ రహదారిపై విజ యవాడ నుంచి తాడేపల్లి గూ డెం వైపు వెళుతున్న ఇన్నోవా కారు డివైడర్‌ను దాటి వచ్చి అవతల వైపు వెళుతున్న కారును ఢీకొన్న ఘటనలో ఒక  రు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామానికి చెం దిన దేవరపల్లి మాణిక్యాలరావు (62), కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వల్లభనేని మధువల్లి, డ్రైవర్‌ షేక్‌ గపూర్‌ స్విప్ట్‌ డిజైర్‌ కారులో గురువారం విజయవాడ వైపు వెళు తున్నారు.అయితే 16వ నెంబరు జాతీయ రహదారి గుండుగొలను (సింగవరం) సమీపంలో విజయవాడ నుంచి అతివేగంగా వస్తున్న ఇన్నోవా కారు డివైడర్‌ దాటు కుని విజయవాడ వైపు వెళుతున్న స్విప్ట్‌ డిజైర్‌ కారును బలంగా ఢీకొంది. దీంతో ముగ్గురు  తీవ్ర గాయా లపాలయ్యారు.పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మాణిక్యా లరావు మృతిచెందాడు.మరో ఇద్దరు తీవ్రగాయాలపాలై చికిత్సపొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాంకుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-11-27T04:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising