పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-06-18T15:32:22+05:30
పశ్చిమగోదావరి జిల్లాను వణికిస్తున్న కరోనా కేసులు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాను కరోనా పాజిటివ్ కేసులు వణికిస్తున్నాయి. జిల్లాలో కొత్తగా రికార్డు స్థాయిలో 57 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 525కు చేరింది. ఏలూరులో ఒకే రోజు 22 కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా... మూడు కంటైన్మెంట్జోన్ల పరిధిని కుదించారు. కొత్తగా నమోదైన కేసుల్లో తొమ్మిది మంది కువైట్ నుంచి వచ్చిన వారు ఉన్నారు.
Updated Date - 2020-06-18T15:32:22+05:30 IST