ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2020-12-06T05:01:01+05:30

అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందించాలని వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ( చిన్నశ్రీను) తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న చిన్న శ్రీను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుర్ల, డిసెంబరు 5: అర్హులందరకీ సంక్షేమ పథకాలు అందించాలని వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ( చిన్నశ్రీను) తెలిపారు.  శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో కల్యాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మండల పరిషత్‌, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.   గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల కోసం ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారని ఆ శాఖ  ఏఈ అచ్చియమ్మ, తహసీల్దార్‌ లావణ్యని అడిగారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే  వారికి అవకాశం కల్పించాలన్నారు.  గ్రామాల్లో   సచివాలయాలు, ఆర్‌బీకే, వెలెనెస్‌ సెంటర్ల పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతి సచివాలయానికి సీసీ రోడ్లు,  డ్రైనేజీ నిమిత్తం సుమారు రూ.10 లక్షలతో ప్రతిపాదనలు తయారుచేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ఈ  సమావేశంలో పశు వైద్యుడు సుబ్రహ్మణ్యం , వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు   సూర్యనారాయణ రాజు, మండల నాయకులు శీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, వరద ఈశ్వరరావు, వెంకటరమణ పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2020-12-06T05:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising