వాల్పోస్టర్ ఆవిష్కరణ
ABN, First Publish Date - 2020-06-02T10:14:46+05:30
లాక్డౌన్ సమయంలో ఇంటి వద్ద ఉంటున్న చిన్నారులు ఉల్లాసంగా ఉండేలా, సృజనాత్మకత
విజయనగరం దాసన్నపేట: లాక్డౌన్ సమయంలో ఇంటి వద్ద ఉంటున్న చిన్నారులు ఉల్లాసంగా ఉండేలా, సృజనాత్మకత వెల్లివిరిసేలా తల్లిదండ్రులు చూడాలని జేసీ కిషోర్కుమార్ తెలిపారు. సోమవారం కార్యాలయంలో జేసీ, జేసీ-2 కూర్మనాథ్లు వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం సంప్రదాయ ఆటలు, ఫజిల్స్తో రూపొందించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు కేసలి అప్పారావు, సీడబ్ల్యూసీ చైర్మన్ లక్ష్మణరావు, వరల్డ్ విజన్ మేనేజరు పి శ్యామ్బాబు, డిసీపీవో బీసీహెచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-02T10:14:46+05:30 IST