టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిని నియమించండి
ABN, First Publish Date - 2020-10-30T11:54:11+05:30
నెల్లిమర్ల నియోజకవర్గానికిగాను ఇన్చార్జిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల నాయకులు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జునను కోరారు.
పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గానికిగాను ఇన్చార్జిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల నాయకులు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జునను కోరారు. చీపురుపల్లిలోని తన స్వగృహంలో టీడీపీ మండల నాయకులు ఆయన ను గురువారం కలిశారు. ఈసందర్భంగా ఆయనను సత్కరించారు. తమ నియో జకవర్గం టీడీపీకి ఎంతో ప్రాముఖ్యతను కలిగిఉందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా నేటి నుంచి నాయకులం దరూ ఆయా గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియో జకవర్గ నాయకులు పతివాడ తమ్మినాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాదరావు, మండల నాయకు లు పిన్నింటి సన్యాశిరావు, పిన్నింటి శ్రీనివాస రావు, విక్రం జగన్నాథం, కొత్తకోట రమణ, మైలపల్లి సింహాచలం పాల్గొన్నారు.
Updated Date - 2020-10-30T11:54:11+05:30 IST