చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
ABN, First Publish Date - 2020-12-06T05:02:30+05:30
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొడుమూరు సాంబమూర్తి(72) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్ఐ పి.రమేష్నాయుడు తెలిపారు.
దత్తిరాజేరు, డిసెంబరు 5: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొడుమూరు సాంబమూర్తి(72) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్ఐ పి.రమేష్నాయుడు తెలిపారు. పెదమానాపురం బీసీ కోలనీ సమీపంలో శుక్రవారం రాత్రి బైకు ఢీకోట్టడంతో తీవ్రంగా గాయపడిన సాంబమూర్తిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారి కూర్మారావు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Updated Date - 2020-12-06T05:02:30+05:30 IST