గాంధీజీ ఆశయాలు నెరవేర్చాలి
ABN, First Publish Date - 2020-08-10T10:30:25+05:30
గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలని గ్రామ స్వరాజ్య వేదిక ప్రతినిధులు తెలిపారు.
బొబ్బిలి, ఆగస్టు 9: గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలని గ్రామ స్వరాజ్య వేదిక ప్రతినిధులు తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాలకులు, దేశపౌరులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణం లో గాంధీ విగ్రహానికి వేదిక రాష్ట్ర కో-కన్వీనరు వి.లక్ష్మునాయుడు, లోక్సత్తా నాయకుడు ఎ.దామోదరరావు, డి.సురేష్ పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలని, పరిశ్రమలు, పాడిపంటలు అభివృద్ధి చెందా లని, మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సత్య నారాయణ, జి.కాశీవిశ్వేశ్వరరావు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-10T10:30:25+05:30 IST