ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంచండి

ABN, First Publish Date - 2020-12-12T05:22:23+05:30

విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని అధికారులు, సిబ్బందికి విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు పిలుపునిచ్చారు. నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పోలీస్‌ డ్యూటీ మీట్‌ ముంగిపు వేడుకలకు డీఐజీ హాజరయ్యారు.

మాట్లాడుతున్న డీఐజీ రంగారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

విజయనగరం క్రైం, డిసెంబరు 11:

విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని అధికారులు, సిబ్బందికి విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు పిలుపునిచ్చారు. నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పోలీస్‌ డ్యూటీ మీట్‌ ముంగిపు వేడుకలకు డీఐజీ హాజరయ్యారు. మూడు జిల్లాలకు చెందిన 61 మంది అధికారులు, సిబ్బంది మీట్‌కు హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన వారికి డీఐజీ చేతులమీదుగా పతకాలు, ప్రశంసాపత్రాలు అందించారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌ను ఏర్పాటుచేసిన ఎస్పీ రాజకుమారిని అభినందించారు. వృత్తిపరమైన అంశాలను అధిగమించేందుకు డ్యూటీ మీట్‌ ఎంతగానో దోహదపడుతుందన్నారు.  జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ డీఐజీ రంగారావు ఇచ్చిన స్ఫూర్తితోనే మంచి కార్యక్రమాన్ని నిర్వహించగలిగామని చెప్పారు. కార్యక్రమంలో విశాఖ ఎస్‌ఈబీ ఏఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌, శ్రీకాకుళం ఏఎస్పీ కె.శ్రీనివాసరావు, విశాఖ ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజు, ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, ఏఎస్‌పీ శ్రీదేవిరావు తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2020-12-12T05:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising