నాడు-నేడు పనుల పరిశీలన
ABN, First Publish Date - 2020-08-12T10:23:33+05:30
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ. 6 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎంఈవో ఎన్.నాగభూషణరావు తెలిపారు.
గరుగుబిల్లి, ఆగస్టు 11 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ. 6 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఎంఈవో ఎన్.నాగభూషణరావు తెలిపారు. మంగళవారం మండలంలో సన్యాసిరాజుపేట, చినగుడబ పాఠశాలల్లో నాడు-నేడు పనులను పరిశీలించి మాట్లాడారు. ఈనెల 20వ తేదీ నాటికి పనులు పూర్తికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. నిర్మాణం చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. అలాగే పాఠశాలలకు రంగులు, ఫర్నీచర్, ప్రయోగశాల, తాగునీటి సౌకర్యాలకు ప్రభుత్వపరంగా టెండర్లు పిలిచామని చెప్పారు. నిర్ధేశించిన సమయానికి ముందే పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Updated Date - 2020-08-12T10:23:33+05:30 IST