ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి విలువ బట్టి ఇంటి పన్ను

ABN, First Publish Date - 2020-11-29T04:29:40+05:30

కుటుంబ యజమాని ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను విధించనున్నట్టు మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ రమేష్‌ తెలిపారు. శనివారం పట్టణంలో నాడు-నేడు నిధులతో జరుగుతున్న మున్సిపల్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు సచివాలయాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

డీవీఎంఎం పాఠశాలను పరిశీలిస్తున్న మునిసిపల్‌ ఆర్డీ రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




మునిసిపల్‌ ఆర్డీ రమేష్‌

పార్వతీపురం టౌన్‌, నవంబరు 28 : కుటుంబ యజమాని ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను విధించనున్నట్టు మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ రమేష్‌ తెలిపారు. శనివారం పట్టణంలో నాడు-నేడు నిధులతో జరుగుతున్న మున్సిపల్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు సచివాలయాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజియన్‌ పరిధిలోని 13 మునిసిపా లిటీల్లోని ఉన్నత, ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే మునిసిపాలిటీల్లో సాలిడ్‌వేస్టు మేనేజ్‌మెంట్‌ కార్య క్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. రీజియన్‌ పరిధిలో ఇ ప్పటి వరకు 30 శాతం పన్ను వసూళ్లను చేపట్టామని, 2021 మార్చి నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. పార్వతీపురం పట్టణానికి సురక్షిత నీటి పథకానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నిధులు త్వరలో మంజూరు కానున్నట్టు తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.కనకమహలక్ష్మి, ఏఈలు ఆనంద్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 





Updated Date - 2020-11-29T04:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising