కిరోసిన్ స్టవ్ పేలి దుకాణం దగ్ధం
ABN, First Publish Date - 2020-02-20T10:58:51+05:30
తహస్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం కిరోసిన్ స్టవ్ పేలడంతో మిఠాయి దుకాణం దగ్ధమైంది.
సాలూరు, ఫిబ్రవరి 19: తహస్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం కిరోసిన్ స్టవ్ పేలడంతో మిఠాయి దుకాణం దగ్ధమైంది. రావాడ కృష్ణ సోదరులతో పాటు బొబ్బిలి గంగయ్యకు చెందిన మిఠాయి, టిఫిన్ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయి. పకోడీ తయారుచేయడానికి స్టవ్ వెలిగించగా కిరోసిన్ లీకై స్టవ్ పేలిపోయి నిప్పంటుకుంది. మొదట మంటలు తక్కువగానే ఉన్నాయి.
కానీ అటుగా వెళుతున్న వారు సెల్ఫోన్లో దాన్ని బంధించడానికి ప్రయత్నించారే గానీ ఆర్పేందుకు ముందుకు రాలేదు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి సమీపంలోని పెట్రోల్ బంక్లోని ఫైర్ఫైట్ సిలెండర్ను తీసుకువచ్చి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేయడంతో పాటు షాపులోని గ్యాస్ సిలెండర్ను బయటకు తీశారు.
Updated Date - 2020-02-20T10:58:51+05:30 IST