క్వారంటైన్లో సదుపాయాలు మెరుగుపర్చండి
ABN, First Publish Date - 2020-05-30T10:53:25+05:30
క్వారంటైన్లో సదుపాయాలు మెరుగుపరచాలని జనసేన పార్టీ సీనియర్ నేత త్యాడ రామకృష్ణ
విజయనగరం, పూల్బాగ్ మే 29 : క్వారంటైన్లో సదుపాయాలు మెరుగుపరచాలని జనసేన పార్టీ సీనియర్ నేత త్యాడ రామకృష్ణ రావు(బాలు) కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ముందు ప్లకార్డులతో నినసన తెలిపారు. క్వారంటైన్లో ఉన్న పిల్లలకు పాలు, గుడ్లు, పండ్లు ఇవ్వాలన్నారు. కంపుకొట్టిన వాటర్ ప్యాకెట్లు, మరుగుదొడ్లతో కార్వంటైన్లో వలస కార్మికులు అవస్థలు పడుతు న్నారని తెలిపారు. దీనిపై స్పందించకుంటే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమ్మిలక్ష్మీరాజ్, వంక నరసింగరావు పిడుగు సతీష్, ఏంటి రాజేష్, దాసరి యోగేష్, పళ్లేం కుమారస్వామి, బీజేపీ నేత నానాజీ పాల్గొన్నారు.
Updated Date - 2020-05-30T10:53:25+05:30 IST