ఆందోళన నడుమ విధులు
ABN, First Publish Date - 2020-08-09T10:48:14+05:30
సచివాలయాల పరిధిలో గ్రామ వలంటీర్లు ఆందోళన నడుమ వి ధులు నిర్వహిస్తున్నారు.
గరుగుబిల్లి : సచివాలయాల పరిధిలో గ్రామ వలంటీర్లు ఆందోళన నడుమ వి ధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ గ్రామంలో కరోనా కేసులు నమోదు కావడంతో భీతి ల్లుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు కోవిడ్-19పై ఇంటింటి సర్వే నిర్వహిం చాల్సిన బాధ్యత వీరిదే. అలాగే రైస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీపీ నమోదుకు ఇంటింటికి వెళ్లి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో వెళ్లకతప్పని పరిస్థితి. శనివారం ఉల్లిభద్రలో దూరం పాటిస్తూ ఈకేవైసీ చేయాల్సిన పరిస్థితి. సంబంధిత అధికారులు దృష్టిసారించి భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Updated Date - 2020-08-09T10:48:14+05:30 IST